Family suicide: ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో విషాధ ఘటన జరిగింది. భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి అనంతరం తాము కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బస్తర్ లాడ్జికి వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల ఉరి కొయ్యకు విగతజీవులుగా వేలాడగా.. పిల్లల మృతదేహాలు బెడ్పై ఉన్నట్లు తెలిపారు. మొదట పిల్లలకు విషమిచ్చి, వారు చనిపోయిన తర్వాతే తల్లిదండ్రులు ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లల చేతులు కట్టేసి ఉన్నాయని, వారి నోట్లో నుంచి నురగ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆత్మహత్యలుగానే భావిస్తున్నామని చెప్పారు. బుధవారం రాత్రి 8:30 గంటలకు ఈ కుటుంబం లాడ్జికి వెళ్లిందని, గురువారం రాత్రి 10 గంటల వరకు తలుపులు తీయకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందిందని వివరించారు. వీరు రాయ్పుర్కు చెందిన వారని గుర్తింనట్లు వెల్లడించారు.
Loud speaker death: గుజరాత్ మెహ్సానాలో 40 ఏళ్ల వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. అతను ఆలయంలో లౌడ్ స్పీకర్లు మోగించాడని ఈ క్రూర చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.