తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ దోషులను క్షమించమనడానికి 'ఇందిరా' ఎవరు? - లాయర్ ఇందిరా జైసింగ్​పై నిర్భయ తల్లి ఆగ్రహం

నిర్భయ దోషులను క్షమించాలని ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన విజ్ఞప్తిపై నిర్భయ తల్లి ఆశాదేవి మండిపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ​ హంతకులను సోనియాగాంధీ క్షమించినట్లుగా నన్ను కూడా నిర్భయ దోషులను క్షమించమనడానికి ఈమె ఎవరని? అగ్రహం వ్యక్తం చేశారు. నేరస్థులకు శిక్షపడాల్సిందేనన్నారు.

nirbhaya mother Asha devi
నిర్భయ దోషులను క్షమించమనడానికి 'ఇందిరా' ఎవరు?: ఆశాదేవి

By

Published : Jan 18, 2020, 10:28 AM IST

ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ సూచనలపై నిర్భయతల్లి ఆశా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్​గాంధీని హత్యచేసిన వారిని సోనియాగాంధీ క్షమించినట్లు.. నిర్భయ దోషులను నేను క్షమించాలని చెప్పడానికి ఈమె ఎవరు? అని ప్రశ్నించారు. నేరస్థులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలాంటి వారివల్లే అత్యాచార కేసుల్లో నిందితులకు సరైన శిక్షలు పడటం లేదని ఆశాదేవి ఆరోపించారు.

'క్షమించవచ్చుగా...'

2012లో దిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం వల్ల నిర్భయ మరణించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత దోషులకు ఉరిశిక్ష పడింది. ఫిబ్రవరి 1న వారికి ఉరితీయాలని దిల్లీ కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్... నిర్భయతల్లి ఆశాదేవికి ట్విట్టర్​ వేదికగా ఓ విజ్ఞాపన చేశారు.

"ఆశాదేవి బాధను నేను అర్థం చేసుకోగలను. రాజీవ్​గాంధీని హత్యచేసిన నళినిని సోనియాగాంధీ క్షమించారు. నేరస్థురాలి మరణాన్ని ఆమె కోరుకోలేదు. ఆశాదేవి మీ వెంట నేనున్నాను. కానీ మరణశిక్షను వ్యతిరేకిస్తున్నాను."- ఇందిరా జైసింగ్​, ప్రముఖ న్యాయవాది

ఇదీ చూడండి: 'రాహుల్ అవసరం భారత్​కు లేదు.. మోదీ స్వయంకృషీవలుడు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details