దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుండటంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ఈ అంశంపై మాట్లాడేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు.
దిల్లీలో ఇండియన్ ఆగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) 58వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హజరైన ఆయన.. 'ప్రపంచ ఆహార సూచీ(జీహెచ్ఐ)'లో భారత్ ర్యాంక్ 102కు పడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
1950-51లో దేశంలో ఆహార ఉత్పత్తులు దాదాపు 51 మిలియన్ టన్నులు కాగా, ప్రస్తుతం 283.37 టన్నులకు పెరిగినప్పటికీ.. జీహెచ్ఐ ర్యాకింగ్స్లో భారత్ స్థానం మరింత దిగజారిందని వెల్లడించారు వెంకయ్య. వియత్నాం.. భారత్ కంటే 10 రెట్లు ఎక్కువ వరిని పండిస్తోందని, ఆ దిశగా మన శాస్త్రవేత్తలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.