తెలంగాణ

telangana

బిహార్​లో యోగికి క్రేజ్​- కీలక స్థానాల్లో ప్రచారం

By

Published : Oct 19, 2020, 3:08 PM IST

బిహార్​ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రచారాలు జోరందుకున్నాయి. బిహార్​లో యూపీ సీఎంకు ఉన్న క్రేజ్​ దృష్ట్యా.. ఆయన ప్రచారంలో పాల్గొనాలనే డిమాండ్​ పెరుగుతోంది. ఈ మేరకు రోజుకు సగటున మూడు ర్యాలీలలో ప్రసంగించనున్నారు యోగి. భాజపా తరఫున ప్రధాని నరేంద్ర మోదీ కూడా 12 ర్యాలీల్లో ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది.

UP CM Yogi Adityanath to address 18 election rallies in Bihar
బిహార్​లో యోగికి క్రేజ్​.. ప్రచార ర్యాలీలో యూపీ సీఎం!

బిహార్​ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో.. భాజపా తరఫున ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ పాల్గొనున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ర్యాలీ ప్రారంభం కానుంది. రోజుకు సగటున మూడు ర్యాలీలతో మొత్తం 18 చోట్ల ప్రసంగించనున్నారు యూపీ సీఎం.

"బిహార్​లో యోగికి మంచి పేరుంది. ముఖ్యంగా యూపీ- బిహార్​ సరిహద్దు ప్రాంతాల్లో ఆయనకు అభిమానులు ఎక్కువ. సీఎం.. తరచూ అక్కడి గోఖర్​నాథ్​ ఆలయాన్ని సందర్శిస్తుండటం వల్ల.. అక్కడివారు ఆయన్ను అమితంగా గౌరవిస్తారు. అందుకోసం బిహార్​ ఎన్నికలకు ఆరు రోజులు కేటాయించారు యోగి. యూపీలోనూ 7స్థానాల్లో ఉప ఎన్నికలు సహా.. మొత్తం 10 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీలును బట్టి మరికొన్ని రోజులు సీఎం బిహార్​లోనే ఉండాల్సి వస్తుంది."

- భాజపా కార్యదర్శి

తొలిరోజు అక్కడి నుంచే..

ప్రచారంలో భాగంగా.. తొలి రోజు రామ్​గఢ్​, ఆర్వాల్​, కరాకత్​ నియోజక వర్గాల్లో ప్రసంగిస్తారు యోగి. మరుసటి రోజు జాముయి, తరారీ, పలియాగంజ్​ ప్రాంతాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఆరు చోట్లా గతంలో సీపీఐ(ఎమ్​ఎల్​)-1, ఆర్జేడీ-5 సీట్లు పొందాయి.

బిహార్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 12 ర్యాలీలలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇలా మొత్తం 30 మంది స్టార్​ ప్రచారకులను నియమంచింది భాజపా.

ఇదీ చదవండి:ఆ చెత్తకుండీలో రూ. 2వేల నోట్లు.. చివరికి!

ABOUT THE AUTHOR

...view details