తెలంగాణ

telangana

దిల్లీ జామియా నగర్​లో వారంలో మూడోసారి కాల్పులు

By

Published : Feb 3, 2020, 6:16 AM IST

Updated : Feb 28, 2020, 11:14 PM IST

దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం (జేఎంఐయూ)లో ఆదివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వర్సిటీ గేట్​ నం.5 వద్ద కాల్పులు జరిపినట్లు జామియా సహకార సంఘం (జేసీసీ) తెలిపింది.

Unidentified miscreants open fire outside Jamia Millia Islamia
దిల్లీ జామియా నగర్​లో వారంలో మూడోసారి కాల్పులు

దిల్లీ జామియా నగర్​లో వారంలో మూడోసారి కాల్పులు

దిల్లీ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం (జేఎంఐయూ)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. గతవారం ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల ఘటన మరువకముందే మరో ఇద్దరు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వర్సిటీ- అయిదో నంబర్​ గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదమూ జరగలేదని జామియా సహకార సంఘం (జేసీసీ) తెలిపింది.

ఎరుపు స్కూటీ, ఎర్రని కోటు...

ఆ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. ఎరుపు రంగు స్కూటీపై వచ్చినట్లు జేసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అందులో ఎర్రని కోటు ధరించిన వ్యక్తి డ్రైవింగ్​ చేస్తున్నట్లు తెలిపారు. దుండగుల స్కూటీ నెంబర్​ 1532 లేదా 1534గా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ ఘటన ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో జరిగిందని కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఓఖ్లా నియోజకవర్గ మాజీ​ శాసనసభ సభ్యుడు అసీమ్​ మహ్మద్​ ఖాన్ తెలిపారు.​ ఈ ఘటనతో కలపుకొని వారం వ్యవధిలో జామియా నగర్​లో మూడుసార్లు కాల్పులు జరిగాయి. హింసాత్మక ఘటనలు పునరావృతమవుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ... వందల సంఖ్యలో విద్యార్థులు స్థానిక ఠాణా ఎదుట ధర్నా చేశారు.

కాల్పుల అనంతరం ఘటనా స్థలికి చేరుకున్న స్టేషన్​ హౌస్​ ఆఫీసర్ ​(ఎస్​హెచ్​ఓ)... ఘటనపై దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి: ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి

Last Updated : Feb 28, 2020, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details