తెలంగాణ

telangana

By

Published : Jul 18, 2020, 6:52 PM IST

ETV Bharat / bharat

భాజపా కార్యకర్తలపై తృణమూల్​ సభ్యుల దాడి

బంగాల్​లోని ఉత్తర 24 పరగణాల​ జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న భాజపా కార్యకర్తలపై టీఎంసీ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో తమ కార్యకర్తలు అనేక మంది గాయపడ్డారని భాజపా తెలిపింది.

TMC workers allegedly attacked BJP workers in Bengal
బంగాల్​లో భాజపా కార్యకర్తలపై తృణమూల్​ సభ్యులు దాడి

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ)- భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఉత్తర​ 24 పరగణాల​ జిల్లాలో భాజపా కార్యకర్తలపై టీఎంసీ సభ్యులు దాడి చేశారు. అంపన్​ తుపాను సహాయక చర్యల్లో అవినీతి ఆరోపణలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు సహా ఇతర అంశాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది భాజపా. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులపై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారని బైరక్​పుర్​ భాజపా ఎంపీ అర్జున్​ సింగ్​ తెలిపారు. మొబైల్​ ఫోన్లు, వాహనాలను తమ నుంచి లాక్కున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి:-దీదీ సర్కార్ రద్దుకు భాజపా డిమాండ్

ABOUT THE AUTHOR

...view details