బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)- భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో భాజపా కార్యకర్తలపై టీఎంసీ సభ్యులు దాడి చేశారు. అంపన్ తుపాను సహాయక చర్యల్లో అవినీతి ఆరోపణలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు సహా ఇతర అంశాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది భాజపా. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులపై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
భాజపా కార్యకర్తలపై తృణమూల్ సభ్యుల దాడి
బంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న భాజపా కార్యకర్తలపై టీఎంసీ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో తమ కార్యకర్తలు అనేక మంది గాయపడ్డారని భాజపా తెలిపింది.
బంగాల్లో భాజపా కార్యకర్తలపై తృణమూల్ సభ్యులు దాడి
ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారని బైరక్పుర్ భాజపా ఎంపీ అర్జున్ సింగ్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, వాహనాలను తమ నుంచి లాక్కున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి:-దీదీ సర్కార్ రద్దుకు భాజపా డిమాండ్