తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం

By

Published : Sep 1, 2019, 11:35 AM IST

Updated : Sep 29, 2019, 1:27 AM IST

హిమాచల్​ ప్రదేశ్​కు దత్తాత్రేయ...

11:44 September 01

ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు...

ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు

ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నూతన గవర్నర్లను నియమించింది. హిమాచల్‌ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తమిళనాడు భాజపా అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన కల్ రాజ్ మిశ్రా.... రాజస్థాన్‌కు బదిలీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా భాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ నియమితులయ్యారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్ సింగ్ కోశ్యారిని.. మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు. మాజీ కేంద్రమంత్రి అరిఫ్ మహమ్మద్ ఖాన్ ను కేంద్రం కేరళ గవర్నర్ గా బాధ్యతలు నిర్వరిస్తారు.

11:25 September 01

ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు

  • -హిమాచల్ ప్రదేశ్ గవర్నర్​గా బండారు దత్తాత్రేయ
  • -మహారాష్ట్ర గవర్నర్​గా భగత్ సింగ్ కోష్యారీ
  • -కేరళ గవర్నర్​గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
  • -తెలంగాణ గవర్నర్​గా తమిళిసై సౌందరరాజన్
  • -రాజస్థాన్​కు హిమాచల్​ నుంచి బదిలీపై వెళ్లిన కల్రాజ్ మిశ్రా
     
Last Updated : Sep 29, 2019, 1:27 AM IST

ABOUT THE AUTHOR

...view details