తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోటార్​ సైకిల్ కోసం నిప్పంటించుకున్న యువకుడు

క్షణికావేశం ఎంత అనర్థం తెస్తుందో కళ్లకు కట్టినట్లు చూపించిన ఓ ఘటన తమిళనాడు అంబూర్ పట్టణంలో జరిగింది. తన ద్విచక్రవాహనాన్ని పోలీసులు సీజ్​ చేశారన్న ఉక్రోషంతో ఓ యువకుడు తనకు తానే నిప్పుపెట్టుకున్నాడు. దీనితో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు.

By

Published : Jul 13, 2020, 1:39 PM IST

Tamil Nadu man sets self on fire opposing police detaining vehicle
మోటార్​ సైకిల్ కోసం నిప్పు పెట్టుకున్న యువకుడు

పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని సీజ్​ చేశారన్న ఉక్రోశంతో... ఓ యువకుడు తనకు తానే నిప్పు పెట్టుకున్న ఘటన తమిళనాడులోని అంబూర్ పట్టణంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని పోలీసులు సకాలంలో ఆసుపత్రికి తరలించారు. దీనితో ప్రాణాపాయం తప్పింది.

మోటార్​ సైకిల్ కోసం నిప్పంటించుకున్న యువకుడు

పోలీసుల కథనం ప్రకారం

"అంబూర్​కు చెందిన 27 ఏళ్ల మొగిలన్ ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతను లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్​పైకి వచ్చాడు. దీనితో అతని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశాం. అయితే ఆ యువకుడు తన బండి తనకు ఇవ్వాలని మమ్మల్ని ప్రాధేయపడ్డాడు. అందుకు నిబంధనలు ఒప్పుకోవని... తరువాత బండిని అప్పగిస్తామని చెప్పాం.

దీనితో అక్కడ నుంచి వెళ్లిపోయిన ఆ యువకుడు కొద్దిసేపటి తరువాత మళ్లీ వచ్చాడు. అప్పటికే అతను మద్యం మత్తులో ఊగిపోతున్నాడు. తన వాహనాన్ని తనకు ఇచ్చి తీరాలని పట్టుబట్టాడు. బండి ఇప్పుడు ఇవ్వడం కుదరని, తరువాత ఇస్తామని అతనికి సర్దిచెప్పాం. అయితే ఉక్రోశం పట్టలేక ఆ యువకుడు తనకు తానే నిప్పు అంటించుకున్నాడు."

- పోలీసులు

మంటల్లో కాలిపోతున్న మొగిలన్​

ఎఫ్​ఐఆర్ నమోదు..

యువకుడిని ఆసుపత్రికి తరలిస్తున్న స్థానికులు

ఈ ఘటనపై... ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా ఎఫ్​ఐఆర్ నమోదు చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో వాహన తనిఖీలు చేపట్టిన ఐదుగురు పోలీసులను ఇప్పటికే తిరుపత్తూరులోని జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసును డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని ఆయన స్పష్టం చేశారు.

యువకుడిని మంటల నుంచి రక్షించిన స్థానికులు

కరోనాపై పోరు

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో... గత రెండు వారాలుగా తమిళనాడులో కఠిన లాక్​డౌన్​ను అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు పోలీసులు ఇప్పటి వరకు 6,30,662 వాహనాలు సీజ్ చేశారు. రూ.17.84 కోట్ల మేర జరిమానాలు విధించారు.

ఇదీ చూడండి:పద్మనాభుడి ఆలయ వివాదం ఏమిటి?

ABOUT THE AUTHOR

...view details