తెలంగాణ

telangana

By

Published : Jul 23, 2019, 11:50 AM IST

Updated : Jul 23, 2019, 4:39 PM IST

ETV Bharat / bharat

మోదీ... 'ఆర్టీఐ'ని నిర్వీర్యం చేయొద్దు: సోనియా

మోదీ సర్కార్​ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీ విమర్శించారు. ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో దేశ పౌరుల్ని శక్తిహీనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మోదీ... 'ఆర్టీఐ'ని నిర్వీర్యం చేయొద్దు: సోనియా

కేంద్ర ప్రభుత్వంపై యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. సమాచార హక్కు చట్టాన్ని మోదీ సర్కార్​ నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు.

కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర విజిలెన్స్​ కమిషన్​లానే... సమాచార హక్కు చట్టానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని సోనియా గాంధీ ఆరోపించారు. గత పదేళ్లలో దాదాపు 60 లక్షల మంది ఆర్టీఐని ఉపయోగించుకున్నారని... తద్వారా దేశంలోని బలహీన వర్గాలకు చాలా లబ్ధి చేకూరిందని ఆమె పేర్కొన్నారు.

ఈ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం... ప్రతి భారత పౌరుణ్నీ శక్తిహీనం చేస్తోందని సోనియా వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టం ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: మాకు 4 వారాల సమయమివ్వండి: రెబల్స్​

Last Updated : Jul 23, 2019, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details