తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు : ఆరుగురు మృతి

తమిళనాడు మన్నార్​గుడిలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

By

Published : Mar 27, 2019, 10:14 PM IST

Updated : Mar 27, 2019, 11:34 PM IST

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు : ఆరుగురు మృతి

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు : ఆరుగురు మృతి
తమిళనాడులోని మన్నార్​గుడిలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో తయారీ కేంద్రం యజమానితో సహా ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాణసంచా తయారీకి వినియోగించే ముడి పదార్థాలతో కార్మికులు పని చేస్తున్న క్రమంలో పేలుడు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

" పేలుడు ధాటికి నలుగురు భవనం నుంచి దూరంగా ఎగిరిపోయారు. మరో ఇద్దరు శిథిలాల కింద ఇరుక్కున్నారు. వారందరూ మరణించారు." - సహాయక చర్యలు చేపట్టిన అధికారి

అగ్నిమాపక సిబ్బందితో పాటు విపత్తు రక్షణ అధికారులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ప్రభుత్వ మెడికల్​ కళాశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తిని చికిత్స అనంతరం ఇంటికి పంపారు.

ఘటనలో ఆరుగురి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి.

Last Updated : Mar 27, 2019, 11:34 PM IST

ABOUT THE AUTHOR

...view details