తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మైనారిటీ' పిల్​పై ఏజీ​ సాయం కోరిన సుప్రీం

దేశంలోని మైనార్టీలను నిర్ణయించే పద్ధతిని మార్చాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. ఈ పిటిషన్​పై అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ సాయం కోరింది. సంబంధిత కాపీలను ఏజీ కార్యాలయానికి పంపాలని పిటిషనర్​ను ఆదేశించింది. నాలుగు వారాల అనంతరం తదుపరి విచారణ చేపడతానంది.

By

Published : Jul 19, 2019, 3:32 PM IST

'మైనారిటీ' పిల్​పై ఏజీ​ సాయం కోరిన సుప్రీం

మైనార్టీలను జాతీయ స్థాయి గణాంకాల ఆధారంగా కాకుండా రాష్ట్ర స్థాయి గణాంకాల ప్రకారం గుర్తించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్​పై అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ సాయం కోరింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యాన్ని విచారించింది. వ్యాజ్యం దాఖలు చేసిన భాజపా నేత, న్యాయవాది అశ్వినీకుమార్​ ఉపాధ్యాయ.. పిటిషన్​ కాపీలను అటార్నీ జనరల్​ కార్యాలయానికి అందించాలని ఆదేశించింది. దీనిపై నాలుగు వారాల తరువాత విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

మైనార్టీ వర్గాలను గుర్తించడంలో జాతీయ స్థాయి గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని సీనియర్​ న్యాయవాది ముఖుల్​ రోహత్గీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు.

ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలను మైనార్టీలుగా గుర్తిస్తూ 26 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్​ను సవాలు చేస్తూ మైనార్టీ అనే పదాన్ని రాష్ట్రస్థాయి జనాభా ఆధారంగా నిర్వచించాలని అశ్వినీకుమార్​ పిటిషన్​ దాఖలు చేశారు. జాతీయ స్థాయి గణాంకాల ఆధారంగా మెజార్టీగా ఉన్న హిందువులు..కొన్ని ఈశాన్య రాష్ట్రాలతో పాటు, జమ్ముకశ్మీర్​లో మైనార్టీలుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాల్లో హిందువులకు మైనార్టీలకు అందాల్సిన ప్రయోజనాలు లభించడం లేదని తెలిపారు.

2011 జనాభా లెక్కల ప్రకారం 8 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు.

ఇదీ చూడండి: 9నెలల్లో బాబ్రీ కేసు తీర్పు ఇవ్వాలి: సుప్రీం

ABOUT THE AUTHOR

...view details