తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శరద్​ పవార్​తో సచిన్ తెందూల్కర్​ భేటీ

ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ను కలిశారు క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​. ముంబయి ​లోని పవార్ నివాసంలో అరగంట పాటు మాట్లాడుకున్నారు.

By

Published : Mar 30, 2019, 9:32 PM IST

శరద్​ పవార్​తో సచిన్ తెందూల్కర్​ భేటీ

ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ను ఆయన నివాసంలో కలిశారు క్రికెట్​ లెజెండ్​ సచిన్​ తెందూల్కర్. అరగంట పాటు ఇరువురు చర్చించుకున్నారు. భేటీలో రాజకీయ అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని ఎన్​సీపీ అధికార ప్రతినిధి నవాబ్​ మాలిక్​ తెలిపారు. ఇది సాధారణ సమావేశమేనని పేర్కొన్నారు.

పాకిస్థాన్​తో భారత్​ ప్రపంచ​కప్ మ్యాచ్ ఆడాలనిసచిన్​ చేసిన వ్యాఖ్యలను భాజపా మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. సచిన్​పై విమర్శల వర్షం కురిపించారు.

ఈ విషయంలో సచిన్​కు మద్దతుగా నిలిచారు శరద్​ పవార్. పాకిస్థాన్ జట్టుపై విజయంతోనే సచిన్​ తన క్రికెట్​ జీవితాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని విమర్శకుల నోళ్లు మూయించారు.

మ్యాచ్​ ఆడకుండా పాకిస్థాన్​కు రెండు కీలక పాయింట్లు అప్పగించడానికి బదులు, మ్యాచ్​ ఆడి విజయం సాధిస్తేనే సరైన జవాబిచ్చినట్లవుతుందని సచిన్ స్పష్టత ఇచ్చారు.

ప్రస్తుత భేటీలో దీనికి సంబంధించిన విషయాలే చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'మా నాన్న ఆ పని ఎప్పుడో చేయాల్సింది'

ABOUT THE AUTHOR

...view details