తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం

By

Published : Aug 24, 2019, 8:01 AM IST

Updated : Sep 28, 2019, 1:58 AM IST

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం-ఇద్దరి మృతి

09:03 August 24

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం

మహారాష్ట్రలోని భీవండిలో శుక్రవారం అర్ధరాత్రి ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అసుపత్రికి తరలించారు.

భవనం కుప్పకూలిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో మరణించిన వారి పంచనామా పూర్తి చేసి మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

08:09 August 24

తాజా దృశ్యాలు

తాజా దృశ్యాలు

భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

07:53 August 24

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం-ఇద్దరు మృతి

మహారాష్ట్రలోని భీవండిలో నిర్మాణంలోని ఓ నాలుగు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు అగ్నిమాపక దళం, పోలీసులు శ్రమిస్తున్నారు.

Last Updated : Sep 28, 2019, 1:58 AM IST

ABOUT THE AUTHOR

...view details