1967లో భారతీయ జన సంఘ్ తరఫున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు రామ్సింగ్ అహిర్వర్. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రోజుల్లో విజయం సాధించి ఎందరో అగ్రనేతల మన్ననలు పొందారు. ఎంపీగా పనిచేసినా... రామ్సింగ్ జీవనశైలిలో ఎలాంటి మార్పు రాలేదు.
ఇదీ చూడండి:భారత్ భేరి: డబుల్ ధమాకాపై డీఎంకే గురి
82 ఏళ్ల వయసులోనూ తన కష్టంపైనే ఆధార పడుతున్నారు రామ్సింగ్. సాగర్లో బీడీలు చుట్టి, పొట్ట నింపుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్నే ఉపయోగిస్తారు. చిన్న ఇంట్లోనే ఉంటున్నారు.
"అప్పట్లో ఎంపీల జీతం రూ. 500 ఉండేది. అక్రమంగా సంపాదించడం సాధ్యం కాదు. అక్రమ సంపాదన నైతిక విలువలకు విరుద్ధం."