తెలంగాణ

telangana

By

Published : Oct 11, 2019, 9:12 PM IST

Updated : Oct 11, 2019, 11:45 PM IST

ETV Bharat / bharat

పరువు నష్టం కేసులో రాహుల్​గాంధీకి బెయిల్​

హత్య కేసులో నిందితుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై ఆరోపణలు చేసిన కేసులో అహ్మదాబాద్​ కోర్టుకు హాజరయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. షాపై వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన ఈ పరువునష్టం కేసులో న్యాయస్థానం రాహుల్​కు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

పరువు నష్టం కేసులో రాహుల్​గాంధీకి బెయిల్​

పరువు నష్టం కేసులో రాహుల్​గాంధీకి బెయిల్​

పరువునష్టం కేసు విషయమై కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ గుజరాత్​లోని అహ్మదాబాద్​ కోర్టులో హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షాను.. హత్య కేసు నిందితుడు అంటూ రాహుల్ ఆరోపించిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. అయితే తాను ఏ తప్పు చేయలేదని రాహుల్​ కోర్టుకు వివరించారు.

రాహుల్ వివరణను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి రాహుల్​కు మినహాయింపు కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్​ దాఖలు చేశారు. ఈ అంశమై విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది న్యాయస్థానం.

మరో కేసులోనూ..

నోట్ల రద్దుకు ముందు అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు (ఏడీసీ) కరెన్సీ మార్పిడి కుంభకోణానికి పాల్పడిందని రాహుల్ ఆరోపించారు. ఈ బ్యాంకు డైరెక్టర్లలో అమిత్​షా ఒక సభ్యుడు కావడమే ఇందుకు కారణం. దీనిపై దాఖలైన పరువు నష్టం కేసులోనూ ఆయన నేడు కోర్టు ఎదుట హాజరయ్యారు.

హార్దిక్​తో భోజనం

విచారణ అనంతరం హార్దిక్ పటేల్ సహా కాంగ్రెస్​ నేతలతో నేతలతో కలిసి అగాషియే హోటల్​లో మధ్యాహ్న భోజనం చేశారు రాహుల్. 2017లో ఈ హోటల్​లోనే జపాన్ ప్రధాని షింజో అబే దంపతులకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు.

అనంతరం గుజరాత్​లోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో చర్చలు జరిపారు.

ఇదీ చూడండి:ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి బహుమతి

Last Updated : Oct 11, 2019, 11:45 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details