తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2020, 11:44 PM IST

ETV Bharat / bharat

పుల్వామా దాడి కేసులో మరో ఇద్దరు అరెస్ట్​

పుల్వామా దాడి కేసులో మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్​ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. అందులో ఒకరు ఆన్​లైన్​ ద్వారా రసాయనాలు కొనుగోలు చేసి ఐఈడీ బాంబులు తయారు చేసినట్లు గుర్తించింది.

Pulwama attack
పుల్వామా దాడి కేసులో మరో ఇద్దరు అరెస్ట్​

యావత్​ దేశాన్ని కలచివేసిన పుల్వామా ఉగ్రదాడి కేసులో మరో ఇద్దరిని అరెస్ట్​ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ). దాడికి ఉపయోగించిన ఐఈడీ బాంబుల కోసం ఈ ఇద్దరిలో ఒకరు ఆన్​లైన్​ ద్వారా రసాయనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించింది.

శ్రీనగర్​లోని బాగ్​ ఎ మెహ​తబ్​ ప్రాంతానికి చెందిన వైజ్​ ఉల్​ ఇస్లాం (19), పుల్వామా జిల్లాలోని హక్రీపొరా గ్రామానికి చెందిన మహ్మద్​ అబ్బాస్​ రాథర్​ (32)గా గుర్తించారు అధికారులు.

" ఐఈడీలు తయారు చేసేందుకు తన అమెజాన్​ ఆన్​లైన్​ షాపింగ్​ అకౌంట్​ను వినియోగించి బ్యాటరీలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసినట్లు మా ప్రాథమిక విచారణలో ఇస్లాం వెల్లడించాడు. ఇదంతా పాకిస్థానీ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్​ తీవ్రవాదుల ఆదేశాలతోనే చేసినట్లు ఒప్పకున్నాడు. గతంలో​ ఉగ్రవాదులకు ఆవాసం కల్పించినట్లు తెలిసింది. "

- ఎన్​ఐఏ అధికారి.

ఇప్పటి వరకు ఐదుగురు అరెస్ట్​..

పుల్వామా దాడి కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్​ చేసింది ఎన్​ఐఏ. ఇటీవల పుల్వామా సమీపంలోని హక్రీపొరాలో నివసిస్తున్న పీర్​ తారీఖ్​, అతడి కుమార్తె ఇంషా సహా ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్​ అహ్మద్​ దార్​కు సన్నిహితుడిని అరెస్ట్​ చేసింది.

2019 ఫిబ్రవరి 14న కారులో మానవబాంబుగా వచ్చి సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​పై దాడి చేసి.. 40 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్నాడు ఆదిల్​ అహ్మద్ దార్​. ఆ మానవబాంబు ఆదిల్​కు పీర్​, ఇంషా సహకరించినట్లు ఆధారాలున్నాయని తెలిపింది ఎన్ఐఏ. జైషేమహ్మద్​ ఉగ్ర సంస్థ చివరిసారిగా విడుదల చేసిన ఆదిల్​ వీడియోను పీర్​ ఇంట్లో చిత్రీకరించినట్లు తేల్చింది.

ఇదీ చూడండి: పోలీసు చెక్​పాయింట్​ వద్ద గ్రెనేడ్​ దాడి.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details