తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ నుంచి ప్రియాంక ప్రచారం

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేడు ఉత్తరప్రదేశ్​లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అలహాబాద్​లో ప్రచారాన్ని ప్రారంభించి జలమార్గం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి చేరుకుంటారు.

By

Published : Mar 15, 2019, 9:10 AM IST

నేడు ఉత్తరప్రదేశ్​లో ప్రియాంక ప్రచారం


కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్​లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. జవహార్​లాల్ నెహ్రూ జన్మస్థలం అయిన అలహాబాద్​లో ప్రచారాన్ని నిర్వహించి పురావస్తు శాలగా మారిన నెహ్రూ నివాసం 'ఆనంద్​ భవన్'​కు చేరుకుంటారు. అనంతరం జలమార్గం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి వెళ్తారు.మార్గమధ్యంలో మిర్జాపూర్​లోని వింద్యావాసిని ఆలయాన్ని సందర్శిస్తారు. వారణాసికి చేరిన అనంతరం కాశీ విశ్వనాథునికి పూజలు నిర్వహిస్తారు.

ప్రియాంక ప్రచారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్​బబ్బర్ వెల్లడించారు.



ABOUT THE AUTHOR

...view details