తూర్పు ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం వ్లాదివోస్టాక్ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించడానికి ఎదురుచూస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.
"మా ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రాంతీయ, అంతర్జాతీయ పరస్పర సమస్యల గురించి నా స్నేహితుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చించడానికి నేను ఎదురుచూస్తున్నాను. ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్కు హాజరయ్యే ఇతర ప్రపంచ నాయకులనూ కలిసి, భారత పారిశ్రామిక వేత్తలు, వ్యాపార ప్రతినిధులతో సంభాషించడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
రక్షణ, పౌర అణుశక్తి రంగాలతోపాటు అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకోవటంపై పరస్పర సహకారానికి ఇరు దేశాలు(రష్యా, భారత్) ఆసక్తిగా ఉన్నాయి. మా మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలు బలపడుతున్నాయి. ఇక ముందు మా దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలకు ప్రంపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుతాయి."