విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటనలో భాగంగా అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియోతో భేటీ అయ్యారు. ఇరు దేశాల వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలు, కశ్మీర్ తాజా పరిస్థితులు సహా ప్రపంచ సమస్యలపై చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
గత వారం సర్వసభ్య సమావేశంలో పసిఫిక్ ప్రాంత అభివృద్ధి అంశంపై ఇరు దేశాలు చర్చించాయి. అప్పటి నిర్ణయాల అమలుకు సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించేందుకు ఈ భేటీ ఉపయోగపడిందని విదేశాంగ శాఖ పేర్కొంది.