తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ సహా పలు అంశాలపై పాంపియో-జైశంకర్​ చర్చ

అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియోతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్​ సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు సహా కశ్మీర్​లో తాజా పరిస్థితులు చర్చకు వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

By

Published : Oct 3, 2019, 10:41 AM IST

Updated : Oct 3, 2019, 10:49 AM IST

పాంపియో, జయ్​శంకర్​

విదేశాంగ మంత్రి జైశంకర్​ అమెరికా పర్యటనలో భాగంగా అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రి మైక్​ పాంపియోతో భేటీ అయ్యారు. ఇరు దేశాల వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలు, కశ్మీర్​ తాజా పరిస్థితులు సహా ప్రపంచ సమస్యలపై చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

గత వారం సర్వసభ్య సమావేశంలో పసిఫిక్​ ప్రాంత అభివృద్ధి అంశంపై ఇరు దేశాలు చర్చించాయి. అప్పటి నిర్ణయాల అమలుకు సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించేందుకు ఈ భేటీ ఉపయోగపడిందని విదేశాంగ శాఖ పేర్కొంది.

కశ్మీర్​ అంశం

ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన అనంతరం కశ్మీర్​ అంశం చర్చకు వచ్చింది. కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేయడానికి గల కారణాలను పాంపియోకు జైశంకర్ వివరించారు. ఆర్టికల్ రద్దు నిర్ణయం ఇప్పటిది కాదని ఎన్నో ఏళ్ల నుంచి ఈ అంశంపై కసరత్తు చేశామని జైశంకర్​ పేర్కొన్నారు.​

ఇదీ చూడండి : క్షణాల్లో పబ్లిక్​ టాయిలెట్స్​ జాడ గూగుల్​ మ్యాప్స్​లో..!

Last Updated : Oct 3, 2019, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details