వారణాసిలో రూ.1,254 కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం ఉత్తర్ప్రదేశ్లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో రూ.1,254 కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు ఆదివారం శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 430 పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. జన్ సంఘ్ మాజీ నేత(ఆర్ఎస్ఎస్) దీన్దయాళ్ ఉపాధ్యాయ 63 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని.
మూడో ప్రైవేటు రైలు
ఉత్తర్ప్రదేశ్ - మధ్యప్రదేశ్ మధ్య 3 ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను కలుపుతూ రాత్రి పూట నడిచే మహాకాళ్ ఎక్స్ప్రెస్ తొలి రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు.
19 భాషల్లో మొబైల్ యాప్
ఇవాళ ఉదయం వారణాసిలో జరిగిన శ్రీ జగద్గురు విశ్వ ఆరాధ్య గురుకుల్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని. శ్రీ సిద్ధాంత్ శిఖామణి గ్రంథ్ అనువదించిన సంస్కరణను మొబైల్ యాప్ ద్వారా 19 భాషల్లో విడుదల చేశారు మోదీ.
ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక సీఎం యడియూరప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:లైవ్ వీడియో : కానిస్టేబుల్ చాకచక్యంతో మహిళ ప్రాణం సేఫ్