తెలంగాణ

telangana

By

Published : Feb 9, 2020, 5:07 PM IST

Updated : Feb 29, 2020, 6:38 PM IST

ETV Bharat / bharat

ఆగని పాక్​ ఆగడాలు.. మోర్టార్ బాంబులతో దాడి

నియంత్రణరేఖ వద్ద వరుసగా రెండోరోజు పాక్​ సైన్యం దుశ్చర్యకు పాల్పడింది. పూంచ్​ సెక్టార్​లో మోర్టార్​ బాంబు​లతో దాడికి తెగించినట్లు రక్షణశాఖాధికారులు వెల్లడించారు.

Pak targets forward areas along LoC in J-K's Poonch for second day
ఆగని పాక్​ ఆగడాలు.. మోర్టార్ బాంబులతో దాడి

సరిహద్దు వెంబడి పాకిస్థాన్​ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్​ పూంచ్​ సెక్టార్​లో వరుసగా రెండోరోజు నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న సరిహద్దు ప్రాంతాలపై మోర్టారు బాంబులతో దాడికి తెగించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో బాలాకోట్​, మేంధార్​​ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు.

శనివారమే కాల్పులు

శనివారం పాక్​ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్​ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వీర మరణం పొందిన జవాను నాయక్​ రాజీవ్​ సింగ్​.. రాజస్థాన్​ జైపూర్ జిల్లావాసి అని అధికారులు స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్​లోని వైమానిక స్టేషన వద్ద పుష్ప గుచ్చాలు అందించిన ఆర్మీ అధికారులు అతడికి సైనిక గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సరిహద్దులో పాక్​ దుశ్చర్య.. భారత​ జవాన్​ మృతి

Last Updated : Feb 29, 2020, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details