నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ సింగ్... రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించాలని హోంమంత్రిత్వ శాఖకు దిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ సిఫార్స్ చేశారు.
"ముకేశ్ క్షమాభిక్షను తిరస్కరించాలన్న సిఫార్సుతో దిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ నుంచి హోంమంత్రిత్వశాఖకు పిటిషన్ అందింది. పిటిషన్ను పూర్తి స్థాయిలో పరిశీలించి.. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటాం."
- హోంమంత్రిత్వ శాఖ అధికారి
ముకేశ్ దాఖలు చేసిన క్షమాభిక్షను తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం లెఫ్ట్నెంట్ గవర్నర్ను బుధవారం కోరింది. ఈ పిటిషన్ను తిరస్కరించాలని లెఫ్ట్నెంట్ గవర్నర్.. హోంశాఖకు వెంటనే సిఫార్సు చేశారు.
ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందున జనవరి 22న ఉరితీయడం సాధ్యం కాదని కేజ్రీవాల్ సర్కారు దిల్లీ కోర్టుకు తెలిపింది.
2012 నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు దోషులు ముకేశ్ కుమార్ సింగ్ (32), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25)లకు జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. ఈ మేరకు దిల్లీ కోర్టు ఈ నెల 7న డెత్ వారెంట్లు జారీ చేసింది.