ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ). పోలీసుల సమక్షంలోనే ఓ మృతదేహాన్ని చెత్తవ్యానులో తరలించడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ.. ఈ ఘటనకు పోలీసులు మౌన సాక్షులుగా నిలవడాన్ని ఆక్షేపించింది. ఈ ఘటన జరిగిన బలరాంపుర్ పాలనా యంత్రాంగానికి మైనారిటీ కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది.
ఇదీ జరిగిందీ..
బలరాంపుర్ జిల్లా ఉత్రౌలా తహసీల్ కార్యాలయానికి వెళ్లిన అన్వర్ అలీ అనే వ్యక్తి అనుమానాస్పదంగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనతో మృతదేహాన్ని చెత్త తీసుకెళ్లే వ్యానులో తరలించారు అక్కడి సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించన వీడియో ఆధారంగా హెచ్ఆర్సీ, రాష్ట్ర మైనారిటీ కమిషన్లు యూపీ ప్రభుత్వం, స్థానిక పాలనా యంత్రానికి నోటీసులు ఇచ్చాయి.
ఇదీ చూడండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!