మధ్యప్రదేశ్ నర్సింగ్పుర్కు చెందిన మున్నీబాయి(65) శ్మశానంలో ఒంటరిగా నివాసం ఉంటోంది. చితి మంటల వెలుగులోనే భోంచేస్తుంది. చితాభస్మం ఎగిరిపడే గాలిని పీలుస్తుంది. పుర్రెలు పగిలే ధ్వనుల మధ్యే నిద్రిస్తుంది. అయినా.. ఆమె కళ్లలో ఇసుమంతైనా భయం కనిపించదు. ఆత్మ విశ్వాసం మాత్రమే ఉంటుంది . అందుకే తెగువగల కాటికాపరిగా గుర్తింపు తెచ్చుకుంది.
గౌరవంగా సంపాదిస్తూ..
మున్నీ భర్త ఏనాడో చనిపోయాడు. కూలీనాలీ చేస్తూ ఒంటరిగానే జీవించడం అలవాటు చేసుకుంది. ఓ పైపు పేదరికం వెక్కిరిస్తున్నా.. కష్టాల కొరడా ఝలిపిస్తున్నా.. ఆత్మాభిమానాన్ని వీడలేదు మున్నీ. భిక్షాటనకు సిద్ధపడలేదు. మామ గరీబ్దాస్, అత్త కౌసల్యల కాటికాపరి వృత్తిలోనే తానూ స్థిరపడాలనుకుంది. మూడేళ్ల క్రితం మహిళా కాటికాపరిగా బాధ్యతలు చేపట్టింది.
శవాలకు సేవలు చేసేందుకు ఏనాడూ సిగ్గు పడలేదు మున్నీ. ఆత్మలు పీక్కుతింటాయని భయపడలేదు. అత్తమామలు నేర్పిన పనిని గౌరవంగా నిర్వర్తిస్తూ.. జీవనం సాగిస్తోంది.
"నేను ఇంత చేస్తున్నా.. అలసిపోను. ఇది నా పని నేనే చేయాలి కదా. అందులో భయమెందుకు? ఈ శ్మశానమంతా తిరుగుతాను. నేను, ఎవ్వరి దగ్గరా ఒక్క రూపాయి కూడా యాచించను. నేను దొంగతనం చేయడం లేదు. పని చేస్తున్నాను. ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇస్తారు. వారు 10 రూపాయలు ఇచ్చినా చాలు."
-మున్నీ బాయి.
శ్మశాన సేవలోనే..
జీవితంలో ఎప్పుడూ ఓటమిని అంగీకరించకూడదు.. ఏదో ఓ రోజు అందరూ శ్మశానవాటికకు రావాల్సినవారే కదా.. అందుకే ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కాటికాపరిగానే పనిచేస్తూ పుణ్యం సంపాందించుకుంటానంటోంది మున్నీ.