తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2020, 7:02 PM IST

ETV Bharat / bharat

ఆ ప్రాంతాల్లో​ ఆగస్టు 31 వరకు లాక్​డౌన్

కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్​డౌన్​ పొడగింపునకు నిర్ణయించింది బంగాల్ ప్రభుత్వం. కంటైన్మెంట్ జోన్​లలో ఆగస్టు 31 వరకు లాక్​డౌన్ కొనసాగనున్నట్లు ప్రకటించింది.

Lockdown in containment extend
మరో నెల రోజులు లాక్​డౌన్​

రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో లాక్​డౌన్ పొడిగించింది బంగాల్ ప్రభుత్వం. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆగస్టు 31 వరకు లాక్​డౌన్​ కొనసాగుతుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులకు ఓ సారి విధించే లాక్​డౌన్ని బంధనలు కూడా అప్పటి వరకు కొనసాగుతాయని తెలిపారు.

రాష్ట్రంలో విద్యా సంస్థలు ఆగస్టు 31 వరకు మూసే ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థలు ఎప్పుడు తెరవాలనే విషయంపై సెప్టెంబర్​లో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

ఇప్పటి వరకు ప్రతి శని, ఆది వారాల్లో లాక్​డౌన్​ విధించగా.. బక్రీద్​, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సారి ప్రత్యామ్నాయ రోజుల్లో లాక్​డౌన్ విధిస్తున్నట్లు బంగాల్​ అధికారులు వెల్లడించారు.

బంగాల్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:'దేశంలో రికార్డు స్థాయిలో 179 కళాశాలలు మూత'

ABOUT THE AUTHOR

...view details