తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ రెస్టారెంట్​లో వడ్డించే రోబో భామలు!

భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు రెస్టారెంట్​లలో రకరకాల ఆఫర్లు, ఆంబియెన్స్​లు క్రియేట్ చేస్తుంటారు యజమానులు. కేరళలోని ఓ రెస్టారెంట్ యాజమాన్యం కూడా వినూత్నంగా ఆలోచించింది. సర్వర్​లుగా రోబోలను నియమించింది. వారితో వడ్డించుకోవాలని మీకూ అనిపిస్తోందా.. ఈ రోబో సర్వర్​లు ఎలా వడ్డిస్తారో మీరూ ఓ లుక్కేయండి.

By

Published : Jul 16, 2019, 5:22 AM IST

కేరళ రెస్టారెంట్​లో వడ్డించే రోబో భామలు!

కేరళ రెస్టారెంట్​లో వడ్డించే రోబో భామలు!

కేరళలోని కన్నూరులో ఓ రెస్టారెంట్​లో అతిథులకు వడ్డించేందుకు రోబో సర్వర్​ భామలు చైనా నుంచి వచ్చేశారు. ఆడపిల్లల దుస్తుల్లో అందంగా కదిలే ఈ ముగ్గురు రోబో సర్వర్లను 'బీ @ కివిజో' అనే రెస్టారెంట్​ వారు దిగుమతి చేసుకున్నారు. ఐదడుగుల ఎత్తుండే ఒక్కో రోబోకి 15 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. వాటికి అలీనా, హెలెన్​, జేన్​ అని పేర్లు కూడా పెట్టారు.

ఈ రెస్టారెంట్​లో వినియోగదారులు తమ టేబుల్​ మీద ఉండే ట్యాబ్​లో ఆహారాన్ని ఆర్డర్​ చేస్తారు. షెఫ్​లు వంటకాలు సిద్ధం చేయగానే రోబోలు ప్రేమగా పలకరించి మరీ అతిథులకు ఆహారం అందిస్తాయి. జ్యూస్​బాక్స్​, బేకింగ్ మమ్మీ అనే కేఫ్​ల నుంచి ఆర్డర్లను కస్టమర్లకు అందిస్తాయి ఈ రోబోలు. అంతే కాదండోయ్​.. పిల్లలకు బోర్​ కొట్టకుండా ఆడించేందుకు ఇక్కడో నాలుగడుగుల పిల్ల రోబో కూడా ఉంది.

మలయాళ సినీ నటుడు మనియన్​ పిల్ల రాజు ఈ రెస్టారెంట్​కు భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. బ్రాండ్​ అంబాసిడర్ కూడా ఈయనే​. రోబో సర్వర్లతో వ్యాపారం బాగా పెరుగుతోంది. దీన్ని ఆదర్శంగా తీసుకుని... దోహాలో 2022 జరగబోయే ప్రపంచకప్​ ఫుట్​బాల్​ పోటీల సమయంలో, ఖతార్​లో ఇలాంటి హోటల్​ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు హోటల్​ యజమానులు.

ఇదీ చూడండి:'దలైలామా వారసుడు చైనా నుంచే రావాలి'

ABOUT THE AUTHOR

...view details