ఈశాన్య దిల్లీలో గత కొద్ది రోజులుగా చెలరేగిన అల్లర్లపై వాదనలు వింటున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్ బదిలీ అయ్యారు. పంజాబ్, హరియాణా హైకోర్టుకు ఆయనను బదిలీ చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు జస్టిస్ మురళీధర్ బదిలీ అయినట్లు తెలుస్తోంది. అయితే పంజాబ్, హరియాణా హైకోర్టులో ఆయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారన్న విషయంలో స్పష్టత లేదు.