తెలంగాణ

telangana

ఝార్ఖండ్ పోరు: కాషాయానికి షాక్​- కాంగ్రెస్​ కూటమికే పట్టం!

By

Published : Dec 23, 2019, 4:41 PM IST

ఝార్ఖండ్​లో మరోమారు భాజపా ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనపడటం లేదు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. మెజారిటీ వైపు అడుగులు వేస్తోంది. తాజా ట్రెండ్స్​ ప్రకారం.. 81 స్థానాలున్న ఝార్ఖండ్​ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్లో ఇప్పటికే కూటమి ముందంజలో ఉంది.

JHARKHAND ELECTIONS: CONGRESS ALLIANCE LEADS MAJORITY SEATS
కాషాయానికి షాక్​- కాంగ్రెస్​ కూటమికే పట్టం!

ఝార్ఖండ్​లో జేఎంఎం నేతృత్వంలోని​ కూటమి ఆధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. 81 నియోజకవర్గాలున్న ఝార్ఖండ్​ శాసనసభలో ఇప్పటికే అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కూటమి. భాజపా ఎదురీదుతోంది.

ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండటం వల్ల కాంగ్రెస్​ కార్యకర్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు.

దిగ్గజాల పరిస్థితి..

ఎన్నికల ఫలితాల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్​... కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా జేఎంఎం నేత హేమంత్​ సొరేన్​ను ప్రకటించింది. హేమంత్​... బోర్​హైత్​, దుంకా సీట్లల్లో దూసుకుపోతున్నారు.

తాజా ఫలితాలతో భాజపా గర్వం దిగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కర్త అజయ్​ శర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రఘుబర్​ దాస్​కు గడ్డుకాలం ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఆయన బరిలో దిగిన తూర్పు జంషెడ్​పుర్​లో స్వతంత్ర అభ్యర్థి సరయు రాయ్​ ముందంజలో ఉన్నారు. సరయు భాజపా రెబల్​ కావడం గమనార్హం. మరి కొందరు సీనియర్​ భాజపా మంత్రులు సీపీ సింగ్​, అనిల్​ కుమార్​ బౌరి ముందంజలో ఉండగా.. రాజ్​ పాలివార్​ వెనుకంజలో ఉన్నారు. గత అసెంబ్లీలో స్పీకర్​గా ఉన్న దినేశ్​ ఓరేన్ వెనుకంజలోనే ఉన్నారు.

81 స్థానాలున్న ఝార్ఖండ్​ శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్ల బలం ఉండాలి.

ఇదీ చూడండి:- 'మోదీ-షా.. దేశ ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారా?'

ABOUT THE AUTHOR

...view details