దిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల ఘటన క్షణాల్లో జరిగిపోయిందని తెలిపారు పోలీసులు. సీఏఏ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా శాంతియుత మార్గంలో నిరసనలు చేస్తున్న విద్యార్థులపై కాల్పులు జరగినందున... జామియా విద్యార్థులతో పాటు ఆప్ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదురయ్యాయి. దుండగుడు కాల్పులు జరుపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తాజా ప్రకటన చేశారు.
" పోలీసులు స్పందించే సమయానికి నిందితుడు కాల్పులు జరిపాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేసును నేర విభాగానికి బదిలీ చేశాం. కాల్పులు జరిపిన వ్యక్తి మైనరా, కాదా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం."
- ప్రవీణ్ రంజన్, ప్రత్యేక పోలీస్ కమిషనర్
గురువారం కాల్పులు...