కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దశల వారీగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది రైల్వే శాఖ. పెరుగుతున్న డిమాండ్ మేరకు.. రద్దీ రూట్లలో క్లోన్ టైన్స్ను సోమవారం ప్రారంభించింది. ఈ క్లోన్ రైళ్లు సాధారణ రైళ్లతో పోలిస్తే.. దాదాపు 3 గంటల ముందుగానే గమ్యస్థానాన్ని చేరుకుంటాయని రైల్వేశాఖ సీనియర్ అధికారి తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రత్యేక క్లోన్ ట్రైన్స్ ప్రారంభం
రైల్వే ప్రయాణాలకు డిమాండ్ పెరుగిన నేపథ్యంలో ప్రత్యేక క్లోన్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది భారతీయ రైల్వే. రద్దీ ప్రాంతాలలో నడిచే ఈ రైళ్లు అత్యవసర ప్రయాణాలు చేపట్టే వారికి వరంగా మారనున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.
నేడు పరుగులు పెట్టిన ప్రత్యేక క్లోన్ రైళ్లు!
క్లోన్ రైళ్లు ఇళ్లకు చేరిన వలస కూలీలను తిరిగి పనులకు చేర్చుతోందని పేర్కొన్నారు రైల్వే, ప్రజా వ్యవహారాల అధికారి దీపక్ కుమార. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న 230 రైళ్లలో దాదాపు 80 శాతం ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఈ తరుణంలో క్లోన్ రైళ్లు అత్యవసర ప్రయాణాలు చేపట్టే వారికి వరంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'సోమవారం నుంచి పరుగులు పెట్టనున్న క్లోన్ ట్రైన్స్'