తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా లాక్​డౌన్​ వేళ దేశంలో ఇదీ పరిస్థితి...

కరోనా వైరస్‌ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా రోడ్లపై జనసంచారం బాగా తగ్గిపోయింది. కొన్నిప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలపై ఓ లుక్కేద్దాం.

By

Published : Mar 27, 2020, 4:09 PM IST

India in 21 days lockdown these are diff situations at All Over Country through Pictures
లాక్​డౌన్​ వేళ దేశంలో ఇదీ పరిస్థితి

కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ఇటీవలె భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ విధించింది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలివే..

డబ్బులు తీసుకునేందుకు క్యూ..

సామాజిక దూరం పాటించాలన్న దిల్లీ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారు అక్కడి ప్రజలు. తాజాగా దిల్లీలోని అంబేడ్కర్​ నగర్​ బ్యాంక్​ ముందు డబ్బులు తీసుకునేందుకు క్యూలో నిలబడి కనిపించారు.

డబ్బులు తీసుకునేందుకు క్యూ..

ఆహార సాయం...

కరోనా కారణంగా లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో.. గుజరాత్​లోని మోటేరాలో ఆహారం లేని పేదలకు స్థానికులు భోజనాలు అందజేశారు.

ఆహార సాయం...

గువహటిలో రద్దీగా మార్కెట్లు..

అసోంలోని గువహటిలో లాక్​డౌన్​ ఉన్నా మార్కెట్లకు భారీగా ప్రజలు తరలివచ్చారు. జ్ఞానేశ్​గురి మార్కెట్​ జనంతో బాగా రద్దీగా కనిపించింది.

గువహటిలో రద్దీగా మార్కెట్లు..

పోలీసుల సహకారంతో..

దిల్లీలోని సదర్​ బజార్​లో స్థానికులు, పోలీసులు కలిసి అన్నదానం చేశారు. పేద ప్రజలకు రోడ్లపైనే భోజనాలు అందజేశారు.

పోలీసుల సహకారంతో..

రోడ్లు కడిగేస్తున్నారు..

ముంబయిలోని మాన్కుర్ధ్​లో అధికారులు శానిటైజేషన్​ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అగ్నిమాపక దళాల సహకారంతో రహదారులను శుభ్రం చేశారు.

రోడ్లు కడిగేస్తున్నారు..

మక్కా మూసుకుపోయింది...

హైదరాబాద్​లోని మక్కా మసీదు జనాలు లేక వెలవెలబోయింది. నిత్యం జనంతో కనిపించే ప్రాంతం లాక్​డౌన్​ కారణంగా నిర్మానుష్యంగా మారింది.

మక్కా మూసుకుపోయింది...

గులాబీలతో ప్రశంసలు...

పుదుచ్చేరిలో వైద్యులు, మెడికల్​ సిబ్బంది, అత్యవసర సేవలు అందిస్తున్న వారికి రోజా పువ్వులు ఇచ్చి అభినందించారు పోలీసులు.

గులాబీలతో ప్రశంసలు...

సరుకులకైనా సామాజిక దూరమే...

మేఘాలయలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు దుకాణాల ముందు వరుసలోనే నిల్చుంటున్నారు.

సరుకులకైనా సామాజిక దూరమే...

తోచిన సాయం...

విధుల్లో ఉన్న పోలీసులకు టీ, అల్పాహారం అందిస్తోంది స్థానిక గురుద్వారా సద్​ సంగత్​. హరియాణాలోని సౌత్​ సిటీలో ఈ దృశ్యం కనిపించింది.

తోచిన సాయం

ఖాళీగా జమ్ము రోడ్లు...

జమ్ముకశ్మీర్​లో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దుకాణాలన్నీ మూసివేయడం వల్ల జనసంచారం కనిపించట్లేదు.

ఖాళీగా జమ్మూ రోడ్లు...

లాఠీతో దెబ్బలు...

కర్ణాకటలోని సర్వోదయ సర్కిల్​ వద్ద కొంతమంది యువకులు రోడ్లపై ద్విచక్రవాహనాలతో తిరిగారు. గస్తీలో ఉన్న పోలీసులు వాళ్లను పట్టుకొని లాఠీ ఝుళిపించారు.

లాఠీ దెబ్బలు

ABOUT THE AUTHOR

...view details