తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనాను దాటేసిన భారత్​- 85,940కి చేరిన కేసులు

భారత్...​ కొవిడ్​-19 కేసుల విషయంలో చైనాను దాటిపోయింది. ప్రపంచదేశాల్లో కేసులపరంగా భారత్​ 11వ స్థానంలో ఉంటే.. చైనా 13వ స్థానంలో ఉంది. దేశంలో కరోనా ఉద్ధృతి ధాటికి గడచిన 24 గంటల్లో 103 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 3,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

By

Published : May 16, 2020, 9:20 AM IST

Updated : May 16, 2020, 10:33 AM IST

India exceeds China in number of Covid-19 cases.
కరోనా కేసుల్లో చైనాను మించిన భారత్​

దేశంలో గడచిన 24 గంటల్లో 3,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 103 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

భారత్ కరోనా టోల్

కరోనా కేసుల్లో భారత్​... చైనాను దాటిపోయింది. ప్రపంచదేశాలతో పోల్చుకుంటే... 85,970 పాజిటివ్ కేసులతో భారత్​ 11వ స్థానంలో ఉండగా.. 82,941 కేసులతో చైనా 13వ స్థానంలో ఉంది. కరోనా మరణాల విషయానికి వస్తే భారత్​లో 2,753 మంది మహమ్మారి బారినపడి మరణిస్తే... చైనాలో 4,633 మంది మృతి చెందారు.

రాష్ట్రాల వారీగా...

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకారం, గడచిన 24 గంటల్లో... మహారాష్ట్రలో- 49, గుజరాత్​- 20, బంగాల్​- 10, దిల్లీ- 8, ఉత్తర్​ప్రదేశ్​- 7, తమిళనాడు- 5, మధ్యప్రదేశ్​- 2, కర్ణాటక- 1, హిమాచల్​ప్రదేశ్​- 1 చొప్పున మరణించారు.

కరోనా కేసుల్లో చైనాను మించిన భారత్​

ఇదీ చూడండి:కరోనా వైరస్‌ జీవ ఆయుధంగా మారితే!

Last Updated : May 16, 2020, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details