వేడుకలకు కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ నాయకులను ఆహ్వానించింది పాక్. దీనితో పాటు పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ వేడుకలకు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ జాతీయ దినోత్సవాన్ని బహిష్కరించిన భారత్
దిల్లీలో శనివారం నిర్వహించే పాకిస్థాన్ జాతీయ దినోత్సవాన్ని బహిష్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కశ్మీర్ వేర్పాటువాదులను ఈ కార్యక్రమానికి పాక్ ఆహ్వానించటమే ఇందుకు కారణం.
పాకిస్థాన్ జాతీయ దినోత్సవ వేడుకలకు భారత్ దూరం
కొన్నేళ్లుగా కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కానీ ఈ ఏడాది భారత్ తరఫున ఏ ఒక్కరిని పంపకూడదని నిశ్చయించింది భారత్.
ఇదీ చూడండీ: పారదర్శకంగా సంఝౌతా కేసు విచారణ: భారత్