అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈ రోజు మంత్రిని కాకపోయి ఉంటే.. ఎయిరిండియాను కొనుగోలు చేసేవాడినని అన్నారు.
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 2020 వార్షిక సదస్సుకు హాజరైన పీయుష్.. 'స్ట్రాటజిక్ అవుట్లుక్: ఇండియా' అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిరిండియా, భారత్ పెట్రోలియం తదితర ప్రభుత్వరంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనల గురించి ప్రస్తావించారు.
ప్రభుత్వ కంపెనీలపై దృష్టి పెట్టాలి!