కరోనా వైరస్ గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫోన్ కాల్స్ ద్వారా ఈ సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ప్రజలకు 1921 అనే నంబర్ నుంచి ఫోన్ వస్తుందని, ప్రతి ఒక్కరు ఈ సర్వేలో పాల్గొనాలని కోరింది. జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుందని ట్వీట్ చేసింది.
"ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న నిష్పాక్షిక సర్వే. ప్రజలంతా ఇందులో పాల్గొని, కరోనా వైరస్, దాని వ్యాప్తి గురించి తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చు. కరోనా పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి."