తెలంగాణ

telangana

నేడు మోదీతో మెర్కెల్​ భేటీ.. 20 ఒప్పందాలపై సంతకం!

By

Published : Nov 1, 2019, 5:16 AM IST

Updated : Nov 1, 2019, 11:39 AM IST

జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​తో నేడు ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మెర్కెల్​ నిన్న దిల్లీ చేరుకున్నారు. ఇరువురు అగ్రనేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. దాదాపు 20 ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది.

నేడు మోదీతో మెర్కెల్​ భేటీ.. 20 ఒప్పందాలపై సంతకం!

నేడు మోదీతో మెర్కెల్​ భేటీ.. 20 ఒప్పందాలపై సంతకం!

రెండు రోజుల పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిన్న రాత్రి దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ ఆమెకు స్వాగతం పలికారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్రమోదీతో నేడు మెర్కెల్​ చర్చలు జరపనున్నారు.

రాష్ట్రపతి భవన్​లో జరిగే స్వాగత కార్యక్రమంలో ఏంజెలా పాల్గొంటారు. అనంతరం రాజ్​ఘాట్​లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.

"ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబధాలు మరింత బలోపేతమవుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్.. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా దిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ​5వ- ఐజీసీ ( ఇంటర్​ గవర్నమెంటల్​ కన్సల్టేషన్స్​)కి మెర్కెల్​ సహ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఏడాది లోపల ఇరువురు అగ్రనేతల మధ్య ఇది అయిదవ భేటీ." - రవీష్​ కుమార్​, విదేశాంగ అధికార ప్రతినిధి

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో సాయంత్రం భేటీ అవుతారు మెర్కెల్. లోక్​కల్యాణ్​ మార్గ్​లో ఉన్న మోదీ నివాసంలో ప్రధానితో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య దాదాపు 20 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇరువురు అగ్రనేతల మధ్య కశ్మీర్​ అంశం చర్చకు వస్తుందా లేదా అనే విషయంపై జర్మనీ రాయబారి స్పందించారు. వారి మధ్య ఎలాంటి విషయమైన చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే కశ్మీర్​పై ఐరోపా సమాఖ్య అభిప్రాయానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఏంజెలా మెర్కెల్​ వాణిజ్య బృందంతో శనివారంసమావేశమవుతారు. గురుగ్రామ్​​ మానేసర్​లోని కాంటినెంటల్​ ఆటోమేటివ్​ కంపోనెంట్స్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ను సందర్శిస్తారు.

Last Updated : Nov 1, 2019, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details