తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2019, 7:02 PM IST

Updated : Apr 23, 2019, 9:39 PM IST

ETV Bharat / bharat

క్రికెటర్​ గంభీర్​, బాక్సర్​ విజేందర్​ నామినేషన్​

తూర్పు దిల్లీ లోక్​సభ స్థానానికి మాజీ క్రికెటర్​, భాజపా నేత గౌతం గంభీర్​ నామపత్రం దాఖలు చేశారు. దక్షిణ దిల్లీ నుంచి మరో క్రీడాకారుడు ఒలింపిక్​ పతక విజేత విజేందర్​ సింగ్​ నామినేషన్ వేశారు.

గౌతం గంభీర్​

గౌతం గంభీర్, భాజపా అభ్యర్థి

తూర్పు దిల్లీ పరిపాలనా కార్యాలయంలో మాజీ క్రికెటర్​, భాజపా నేత గౌతం గంభీర్​ నామపత్రం దాఖలు చేశారు. తూర్పు దిల్లీ లోక్​సభ స్థానం నుంచి సార్వత్రిక బరిలో నిలిచారు గంభీర్​. ఎన్నికల్లో గెలిస్తే నగరంలో తూర్పు దిల్లీకి ప్రత్యేక గుర్తింపు లభించేలా చేయటమే లక్ష్యమని తెలిపారు.

"భాజపా చెప్పింది చేసి చూపిస్తుంది. పార్టీ ఎప్పుడూ అభివృద్ధి గురించే మాట్లాడుతుంది. ఈ ఐదేళ్లలో మన ప్రధానమంత్రి దార్శనికతను​ మనం చూశాం. అభివృద్ధి చేసి, అందరినీ కలుపుకుని వెళ్లి భారత్​ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దారు. నా విషయానికొస్తే నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ధ్యేయం."
-గౌతం గంభీర్, భాజపా అభ్యర్థి

దక్షిణం నుంచి మాజీ బాక్సర్​

దక్షిణ దిల్లీ స్థానం నుంచి మాజీ బాక్సర్​, ఒలింపిక్​ పతక విజేత విజేందర్​ సింగ్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న విజేందర్ సింగ్.. ఈ రోజు నామపత్రం దాఖలు చేశారు.

దిల్లీలోని ఏడు లోక్​సభ స్థానాలకు మే 12న ఎన్నికలు జరుగుతాయి.

ఇదీ చూడండి:'పుల్వామా' పాత్రధారుల్ని మట్టుబెట్టిన సైన్యం

Last Updated : Apr 23, 2019, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details