తెలంగాణ

telangana

ఎంపీలతో జాగ్రత్త... అధికారులకు కేంద్రం స్వీట్ వార్నింగ్

By

Published : Feb 13, 2020, 4:54 PM IST

Updated : Mar 1, 2020, 5:37 AM IST

ప్రభుత్వ ఉద్యోగులు ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రోటోకాల్​కు అనుగుణంగా వ్యవహరించాలని కేంద్రం కీలక అదేశాలు జారీ చేసింది. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాల సమయంలో కచ్చితంగా ప్రోటోకాల్​ను పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది.

mp protocol norms
ఎంపీలతో జాగ్రత్త... అధికారులకు కేంద్రం స్వీట్ వార్నింగ్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రోటోకాల్​కు అనుగుణంగా కచ్చితంగా నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రోటోకాల్​ నిబంధనలను పాటించకపోతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్​ను ఉల్లంఘిస్తున్నారని గమనించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది కేంద్రం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సమాజంలో కీలక స్థానం ఉందన్న కేంద్రం.. వారి బాధ్యతల్లో భాగంగా వివిధ శాఖల అధికారుల నుంచి సమాచారం తెలుసుకోవచ్చని, అలాగే అవసరమైతే సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.

అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య ప్రొటోకాల్​కు సంబంధించిన నిబంధనలను సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉందని కేంద్రం పేర్కొంది.

మరీ ముఖ్యంగా పార్లమెంటు సమావేశాల సమయంలో అధికారులు కచ్చితంగా ప్రోటోకాల్​ను పాటించేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం.

ఇదీ చూడండి: ఇక రూ.13కే లీటర్​ వాటర్​ బాటిల్​- సర్కార్ కీలక నిర్ణయం

Last Updated : Mar 1, 2020, 5:37 AM IST

ABOUT THE AUTHOR

...view details