తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2020, 4:12 PM IST

Updated : Jan 12, 2020, 4:41 PM IST

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎదురుకాల్పులు-ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రమూకలు నక్కి ఉన్నారన్న సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు జవాన్లు. ఈ క్రమంలో సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు.

army
కశ్మీర్​లో ఎదురుకాల్పులు-ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో గుల్షన్​పొర ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి బలగాలు. ఈ క్రమంలో సిబ్బందిపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా భద్రతా సిబ్బంది దీటుగా సమాధానమిచ్చారు. మృతుల నుంచి మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

మృతులను హిజ్బుల్ ముజాహిదిన్​కు చెందిన ఉమర్ ఫయాజ్​ లోనీ, ఆదిల్ బషీర్​ మీర్, ఫైజాన్ హమీద్ భట్​గా గుర్తించారు అధికారులు.

ఇదీ చూడండి: భారత పౌరుడి తల నరికేసిన పాక్​ సైన్యం

Last Updated : Jan 12, 2020, 4:41 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details