లాక్డౌన్ కారణంగా అనేక మంది వలసదారులు సుదూర ప్రాంతాలకు ప్రయాణం కొనసాగిస్తున్న నేపథ్యంలో... వారందరికీ ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్రాలను కోరారు కేంద్ర ఆహార మంత్రి రామ్ విలాస్ పాసవాన్. 15 రోజుల్లో 8 కోట్ల మంది వలసదారులకు ఆహర ధాన్యాలను అందించాలన్నారు. గోదాములను తక్షణమే తెరచి ఈ మేరకు చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర రేషన్ కార్డుల్లో ఏదీ లేకపోయినా అంగీకరించాలని స్పష్టం చేశారు.
కేంద్రం నిర్ణయంతో అత్యధికంగా ఉత్తర్ప్రదేశ్లో 1.42కోట్ల మంది వలసదారులు లబ్ధి పొందనున్నారు. బిహార్లో 86.45 లక్షల మంది, మహారాష్ట్రలో 70, బంగాల్లో 60.1, మధ్యప్రదేశ్లో 54.6, రాజస్థాన్లో 44.66, కర్ణాటకలో 40.19, గుజరాత్లో 38.25, తమిళనాడులో 35.73, ఝార్ఖండ్లో 26.37, ఆంధ్రప్రదేశ్లో 26.82, అసోంలో 25.15 లక్షల మంది వలసదారులు రేషన్ పొందనున్నారు. దేశ రాజధాని దిల్లీలో 7.27లక్షల మంది వలసదారులకు ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం, కేజీ పప్పు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.