తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2020, 12:14 PM IST

ETV Bharat / bharat

కరోనా సోకిందన్న డౌట్​తో బస్సు డ్రైవర్​ ఆత్మహత్య

కరోనా వైరస్​ సోకిందన్న భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కర్ణాటక ఉడుపి జిల్లాలోని ఉప్పూర్​కు చెందిన ఓ వ్యక్తి. కానీ అతడికి వైరస్ సోకిన లక్షణాలేవీ లేవని అధికారులు స్పష్టంచేశారు.

Covid-19 doubts: Man ends life in Karnataka
కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్న బస్సు డ్రైవర్​

కర్ణాటక ఉడుపి జిల్లాలో దారుణం జరిగింది. కరోనా వైరస్​ సోకిందన్న భయంతో 56 ఏళ్ల వృద్ధుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అతడికి ఎటువంటి వైరస్​ లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు.

అనుమానమే పెనుభూతం...

56 ఏళ్ల గోపాలకృష్ణ ఉడుపి జిల్లా ఉప్పూర్​ గ్రామంలో నివసించేవాడు. కేఎస్​ఆర్టీసీలో బస్సు డ్రైవర్. ఇటీవల అతడికి కొత్త డ్రైవర్లకు శిక్షకుడిగా పోస్టింగ్ ఇచ్చారు అధికారులు.

తనకూ కరోనా సోకిందని గోపాలకృష్ణకు అనుమానం వచ్చింది. అదే విషయాన్ని ఆయన కొందరు స్థానికులకూ చెప్పాడు. గత రాత్రి 2 గంటల వరకు మెలకువగానే ఉండి, కుటుంబసభ్యులతో మాట్లాడాడు. ఉదయం 5 గంటలకు ఇంట్లోని వారు లేచి చూసేసరికి చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించాడు.

కరోనా వైరస్​ సోకిందన్న అనుమానంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గోపాలకృష్ణ రాసిన లేఖ ఇంట్లో కనిపించింది. కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని ఆ లేఖలో సూచించాడు.

ఇదీ చూడండి:దేశంలో మరింత పెరిగిన కరోనా మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details