కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని నివారణ చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా దేశంలోని మొత్తం 12 ప్రధాన ఓడరేవుల్లో నావికులు, ప్రయాణికులను స్క్రీనింగ్, డిటెక్షన్, వ్యాధిసోకిన వారిని వేరుగా ఉంచే వ్యవస్థలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
"నావికులు, ప్రయాణికులకు కరోనా వైరస్ సోకిందీ లేనిదీ తెలుసుకోవడానికి ఓడరేవుల్లో వెంటనే స్క్రీనింగ్, డిటెక్షన్, వ్యాధిసోకిన వారిని వేరుగా ఉంచే వ్యవస్థలను ఏర్పాటుచేయాలి."- షిప్పింగ్ మంత్రిత్వశాఖ
కట్టుదిట్టంగా
ప్రయాణికులను పరీక్షించడానికి ఎన్-95 మాస్క్లతో పాటు థర్మల్ స్కానర్లను సేకరించాలని పోర్టులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో పాటు సిబ్బంది, ప్రయాణికుల నుంచి స్వీయ డిక్లరేషన్ తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. పోర్ట్ ఆసుపత్రులు, ప్రాంగణాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుచేయాలని, తీవ్రమైన కేసులను పెద్దాసుపత్రులకు తరలించాలని పేర్కొంది. అలాగే ఈ విషయాలను క్యాబినెట్ సచివాలయానికి రోజువారీగా తెలియజేయాలని నిర్దేశించింది.
ప్రభుత్వ ఆదేశాలతో ప్రధాన ఓడరేవులన్నీ ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపీ) జారీచేయడం సహా అనేక చర్యలు చేపట్టాయి. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 6 మధ్య చైనా నుంచి భారత్కు వచ్చిన 85 ఓడల్లోని 4,274 ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించాయి.
అవగాహన కోసం