తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​కు భారీగా కేంద్ర బలగాల తరలింపు

10 వేల మంది అదనపు భద్రతా సిబ్బందిని జమ్ముకశ్మీర్​లో మోహరించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. అమర్​నాథ్ యాత్ర ముగింపు, త్వరలో కశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

By

Published : Jul 27, 2019, 4:48 PM IST

కశ్మీర్​కు భారీగా కేంద్ర బలగాల తరలింపు

కశ్మీర్​లో భద్రతను మరింత కట్టుదిట్టం దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 వేల మంది రక్షణ సిబ్బందిని తరలించాలని హోంశాఖ ఈ నెల 25న ఆదేశాలిచ్చింది.

50 కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు(సీఆర్​పీఎఫ్), సశస్త్ర సీమాబల్​ (ఎస్​ఎస్​బీ) 30, భారత్-టిబెట్ సరిహద్దు పోలీస్ దళం(ఐటీబీపీ) 10, సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్)10 సైనిక కంపెనీలను రైలుమార్గం ద్వారా తరలించనున్నారని సమాచారం.

అమర్​నాథ్ యాత్ర ఆగస్టు 15తో ముగియనుండటం, సరిహద్దు వెంట భద్రత పెంపు, త్వరలో కశ్మీర్​లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బలగాల మోహరింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: వరదల్లో చిక్కుకున్న రైలు- ప్రయాణికులు సురక్షితం

ABOUT THE AUTHOR

...view details