తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2019, 7:20 PM IST

ETV Bharat / bharat

'నేను బతికున్నంత వరకు బంగాల్​లో సీఏఏ అమలు కాదు'

దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు బంగాల్​లో​ సీఏఏను అమలు కానివ్వనని తేల్చిచెప్పారు.

CAA will not be implemented in Bengal as long as I am alive:
'నేను బతికున్నంత వరకు బంగాల్​లో సీఏఏ అమలు కాదు'

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. బంగాల్​లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. అయితే సీఏఏపై తాజాగా మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంతవరకు బంగాల్​​లో పౌరసత్వ చట్టాన్ని అమలు చేయనివ్వబోనని ఉద్ఘాంటించారు.

"నేను జీవించి ఉన్నంత కాలం బంగాల్​లో సీఏఏను అమలు చేయనివ్వను. ఎవ్వరూ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. బంగాల్​లో ఎటువంటి నిర్బంధ కేంద్రం ఉండదు. కిరాతకమైన ఈ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఎందుకు నిరసనలు చేయకూడదు? ఆందోళనలు చేపట్టిన విద్యార్ధులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారిని విశ్వవిద్యాలయాల నుంచి బహిష్కరిస్తోంది."

మమతా బెనర్జీ, బంగాల్​​​ ముఖ్యమంత్రి

ప్రజల హక్కులను ఎవ్వరూ కాలరాయలేరని తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి అన్నారు. దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలకు విద్యార్థులు మద్దతు ఇస్తున్నారని మమతా పేర్కొన్నారు. 18 ఏళ్లకే ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు యువతకు ఉన్నప్పుడు.. నిరసనలు చేసే హక్కువారికి ఎందుకు లేదని దీదీ ప్రశ్నించారు.

ఇదీ చూడండి: గిరిజన పండుగలో ప్రత్యేక ఆకర్షణగా 'రాహుల్ నృత్యం'

ABOUT THE AUTHOR

...view details