తెలంగాణ

telangana

ETV Bharat / bharat

22 రోజులుగా వధువు ఇంట్లోనే 'బరాత్​ గ్యాంగ్​'

కరోనా మహమ్మారి కట్టడితో విధించిన లాక్​డౌన్​తో ఉత్తర్​ప్రదేశ్​ అలీఘడ్​లో ఓ పెళ్లి బృందానికి అనూహ్య అనుభవం ఎదురైంది. రెండు రోజుల్లో సొంత ఊరికి వెళ్లిపోతామని అనుకున్న వారు.. 22 రోజులుగా వధువు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

By

Published : Apr 13, 2020, 7:28 PM IST

Baraat
లాక్​డౌన్​తో 22 రోజులుగా వధువు ఇంట్లోనే 'బరాత్​' సభ్యులు

పెళ్లి, ఆ తర్వాత బరాత్​​ అంగరంగ వైభవంగా జరుగుతాయి. బరాత్​లో పాల్గొనేందుకు వరుడి బంధువులు వధువు ఇంటికి వస్తారు. బరాత్​ పూర్తి చేసుకుని మూడో రోజు సొంత ఊరికి చేరుతారు. అయితే.. ఉత్తర్​ప్రదేశ్​ అలీఘడ్​లో బరాత్​ బృందానికి వింత అనుభవం ఎదురైంది. కరోనాతో లాక్​డౌన్​లో చిక్కుకుని 22 రోజులుగా వధువు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.

వధువు ఇంట్లో భోజనం చేస్తున్న బరాత్​ సభ్యులు

అలీఘడ్​​లోని అత్రౌలికి చెందిన యువతితో ఝార్ఖండ్​కు చెందిన విజయ్​ మహతో అనే యువకుడికి మార్చి 21న వధువు ఇంట్లో వివాహం జరిగింది. కుమారుడి పెళ్లి బరాత్​ (పెళ్లి ఊరేగింపు) కోసం 15 మంది బంధువులను తీసుకుని అత్రౌలికి వచ్చాడు వరుడి తండ్రి రామ్​నాత్​ మహతో. వీరంతా బరాత్​​ పూర్తి చేసుకుని మార్చి 23న ఝార్ఖండ్​కు తిరిగి వెళ్లాలి. కానీ.. 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించటం.. ఆ వెంటనే లాక్​డౌన్​ ప్రకటించటం వల్ల వధువు ఇంట్లోనే చిక్కుకుపోయారు బరాత్​కు వచ్చిన వరుడి బంధువులు. గత 22 రోజులుగా అక్కడే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు.

వరుడు, అతని బంధువులకు ఏర్పాట్లు చేయటంలో ఇబ్బందులు పడుతున్నామని వధువు తండ్రి నర్పత్​ రాయ్ పేర్కొన్నారు.

విజయ్​ మహతో పెళ్లి ఫోటో

" వారు వెళ్లేందుకు జిల్లా అధికారులు అనుమతించటం లేదు. వారికి అధికారులే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం పెడుతున్నా. 15 మందికి రోజుకు రెండుసార్లు ఆహారం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సరకులు తేవడానికి ఇబ్బందులు పడుతున్నాం. చేతిలో డబ్బు కూడా అయిపోయింది."

- నర్పత్​ రాయ్​, వధువు తండ్రి

గిన్నిస్​ రికార్డు సాధిస్తాం..

లాక్​డౌన్​ పూర్తయ్యే సరికి వధువు ఇంట్లో ఎక్కువ రోజులు గడిపిన బరాత్​ సభ్యులుగా.. గిన్నిస్​ బుక్​ రికార్డు సాధించేందుకు అర్హులమవుతామని వారిలో ఓ వ్యక్తి చమత్కరించాడు.

ఇదీ చూడండి: పోలీస్​ ఆర్కెస్ట్రా: లాక్​డౌన్​లో వినోదం హోమ్​ డెలివరీ

ABOUT THE AUTHOR

...view details