జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా ట్రాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ఓ తీవ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాది మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుని పూర్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.
ట్రాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సైన్యం రాకను గమనించిన తీవ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగించారు. అనంతరం ఎదురుకాల్పులు జరిపిన భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి.
ఇదీ చూడండి : ఇంటి పైకప్పు కూలి ఆరుగురు మృతి