కేంద్రానికి మరో హెచ్చరిక జారీ చేశారు హస్తిన సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు. మరోసారి జనవరి 4న జరగనున్న చర్చల్లో తమకు అనుకూలమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో కేవలం 5శాతం సమస్యలనే విన్నవించినట్లు అన్నదాతలు పేర్కొన్నారు.
రైతు సంఘాలు-ప్రభుత్వం మధ్య జనవరి 4న జరగనున్న సమావేశంలో పురోగతి లేకుంటే.. జనవరి 6న ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తామని రైతుల ప్రతినిధి యుధ్వీర్ సింగ్ అన్నారు. హరియాణా- రాజస్థాన్ సరిహద్దుల్లోని రైతులు భారీ సంఖ్యలో.. దిల్లీని ముట్టడిస్తారని హెచ్చరించారు. హరియాణాలో.. షాపింగ్ మాళ్లు, పెట్రోల్ బంకులు బంద్ చేస్తామని మీడియాకు వెల్లడించారు.