మహారాష్ట్రలో విరుచుకుపడిన 'నిసర్గ' తుపాను ముంబయి నగరంపై సానుకూల ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. గురువారం నాటికి గాలి నాణ్యత 17కు చేరినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో నమోదైన వాటిలో ఇదే అత్యుత్తమమైనదని వాతావరణ అంచనా పరిశోధనా వ్యవస్థ (ఎస్ఏఎఫ్ఏఆర్) తెలిపింది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన సూచీలో అత్యుత్తమైనది ఇదే. అధిక వేగంతో వీచిన గాలులు, వర్షపాతం.. గాలి నాణ్యత మెరుగుపడేందుకు కారణమయ్యాయి.