తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హస్తిన పోరు: ఆమ్​ఆద్మీపై అమిత్​ షా మొదటి పంచ్​

దిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూలు విడుదలయింది. ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. దిల్లీలో అధికార ఆమ్​ఆద్మీ పార్టీ లక్ష్యంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు చేశారు. మరోవైపు ఐదేళ్లలో అభివృద్ధిని పరిశీలించి ఓటు వేయాలని ప్రజలను ఆప్ అధినేత కేజ్రీవాల్​ విజ్ఞప్తి చేశారు.

By

Published : Jan 6, 2020, 6:52 PM IST

DELHI POLLS
DELHI POLLS

దిల్లీ శాసనసభ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో తమ వ్యూహాలకు పదును పెట్టింది భాజపా. ఆమ్​ఆద్మీ ప్రభుత్వం లక్ష్యంగా భాజపా అధ్యక్షుడు అమిత్​ షా వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఐదేళ్లుగా ప్రజలను కేజ్రీవాల్​ ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని విమర్శించారు.

"ప్రజాస్వామ్య పండుగపై నాకు విశ్వాసం ఉంది. ఐదేళ్లుగా ప్రజలను మభ్యపెడుతూ కేజ్రీవాల్​ ప్రభుత్వం హామీలను విస్మరించింది. ఇందుకు ఓటమి తప్పదు. ప్రధాని మోదీ నాయకత్వంలో దిల్లీలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేస్తుంది. ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్​లో పాల్గొని కొత్త రికార్డు సృష్టించాలి."

- అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు

హామీలను పక్కనబెట్టి ప్రజల సొమ్ముతో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటనలు, ప్రచారం నిర్వహిస్తోందని ఆరోపించారు షా. ఆప్​ హామీ ఇచ్చిన ఉచిత వైఫై, 15 లక్షల సీసీటీవీలు, కొత్త కళాశాలు, ఆసుపత్రుల కోసం దిల్లీ వాసులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు.

పాలన చూసే ఓటు వెయ్యండి: కేజ్రీవాల్​

మరోవైపు దిల్లీలో చేసిన అభివృద్ధిని పరిశీలించిన తర్వాతే తమకు ఓటు వేయాలని ముఖ్యమంత్రి, ఆమ్​ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దిల్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన అనంతరం రాజధానిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు కేజ్రీవాల్.

-అరవింద్ కేజ్రీవాల్​, దిల్లీ సీఎం

"నేను ఈ రోజు దిల్లీ వాసులకు ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. మేం పని చేసినట్లు మీకు అనిపిస్తే మాకు ఓటు వేయండి. మాకు మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు వస్తుంది. పని చేయలేదనిపిస్తే ఓటు వేయకండి."

-అరవింద్ కేజ్రీవాల్​, దిల్లీ సీఎం

ఇదీ చూడండి: దిల్లీలో మోగిన సమరశంఖం- ఫిబ్రవరి 8న పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details