ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వెళితే తల్లిదండ్రులకు కంటిమీద కునుకు ఉండడంలేదు. సమాజం సిగ్గుపడేలా.. దేశంలో రోజురోజుకూ అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయి. తమిళనాడు కోయంబత్తూర్లో పుట్టిన రోజు జరుపుకుని తిరిగివస్తోన్న ఓ బాలికపై ఆరుగురు అతి రాక్షసంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక నవంబర్ 26న తన పుట్టినరోజు జరుపుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. స్నేహితుడితో కలిసి పార్క్కు వెళ్లి.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఆరుగురు వారిని అడ్డుకున్నారు. బాలికతో ఉన్న స్నేహితుడ్ని కొట్టి, ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి ఈడ్చుకెళ్లారు. అతికిరాతకంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
వీడియో తీసి మరీ..
పశువులు కూడా అసహ్యించుకునే పని చేస్తూ.. ఆ నీచ కృత్యాన్ని వీడియోలో బంధించారు మృగాళ్లు. సెల్ఫోన్లలో చిత్రీకరించిన వీడియో పోలీసులకు లభించింది.