తెలంగాణ

telangana

ఆగని రాక్షసకాండ.. బాలికపై ఆరుగురి అరాచకం

By

Published : Dec 2, 2019, 9:56 AM IST

వరుస అత్యాచారాలతో దేశం వణికిపోతున్న తరుణంలో తమిళనాడులో  మరో దారుణం బయటపడింది. పుట్టినరోజునాడు ఓ బాలికపై అసురులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వీడియో చిత్రీకరించి రాక్షసానందం పొందారు. అందులో నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

A minor girl  who was out with her male friend in a park in Tamil Nadu's Coimbatore to celebrate her birthday was allegedly raped by six men
ఆగని రాక్షసకాండ.. బాలికపై ఆరుగురి అరాచకం

ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వెళితే తల్లిదండ్రులకు కంటిమీద కునుకు ఉండడంలేదు. సమాజం సిగ్గుపడేలా.. దేశంలో రోజురోజుకూ అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయి. తమిళనాడు కోయంబత్తూర్​లో పుట్టిన రోజు జరుపుకుని తిరిగివస్తోన్న ఓ బాలికపై ఆరుగురు అతి రాక్షసంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇంటర్​ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక నవంబర్​ 26న తన పుట్టినరోజు జరుపుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. స్నేహితుడితో కలిసి పార్క్​కు వెళ్లి.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఆరుగురు వారిని అడ్డుకున్నారు. బాలికతో ఉన్న స్నేహితుడ్ని కొట్టి, ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి ఈడ్చుకెళ్లారు. అతికిరాతకంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

వీడియో తీసి మరీ..

పశువులు కూడా అసహ్యించుకునే పని చేస్తూ.. ఆ నీచ కృత్యాన్ని వీడియోలో బంధించారు మృగాళ్లు. సెల్​ఫోన్​లలో చిత్రీకరించిన వీడియో పోలీసులకు లభించింది.

అమ్మా.. నన్ను వదల్లేదు!

ఆ క్రూర మృగాల నుంచి తప్పించుకుని ఇల్లు చేరింది బాలిక. అమ్మతో జరిగిందంతా చెప్పుకుంది. తరువాతి రోజు మహిళా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.

నలుగురు దొరికారు..

పోలీసుల దర్యాప్తులో నలుగురు నిందితులు పట్టుబడ్డారు. వీరిపై బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం- పోక్సో (పీఓసీఎస్​ఓ) లోని సెక్షన్​ 354 కింద ఓ కేసు.. ఐపీసీ 506(ii) కింద మరో కేసు నమోదు చేశారు. మహిళా కోర్టులో హాజరు పరిచాక రిమాండుకై తమిళనాడు సెంట్రల్ జైలుకు తరలించారు. మరో ఇద్దరి జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:'ప్రియాంక చోప్రా'కు జై కొట్టిన​ కాంగ్రెస్​..!

ABOUT THE AUTHOR

...view details